కువైట్ లో ప్రవాసుల అప్పులు అర బిలియన్ దినార్లు..!
- September 08, 2023
కువైట్: కువైట్ రాష్ట్రానికి విదేశీయులు చెల్లించాల్సిన మొత్తం అప్పులు, జరిమానాలు, సేవా రుసుములు దాదాపు అర బిలియన్ దినార్లు ఉంటుందని ఓ నివేదిక తెలిపింది. విదేశీయులు దేశం విడిచి వెళ్ళే ముందు వారి రుణాలను తప్పనిసరిగా చెల్లించాలని ఇటీవల మంత్రిత్వ శాఖలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశాలతో ప్రవాసులు ప్రయాణానికి ముందు జరిమానా క్లియర్ చేయడాన్ని తప్పనిసరి చేశాయి మంత్రిత్వ శాఖలు. ఈ బకాయి వసూళ్లు ప్రభుత్వ సంస్థల మధ్య సంబంధాన్ని వేగవంతం చేయడానికి,వాటి మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగం, విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖతో సహా నాలుగు ప్రభుత్వ సంస్థలు విదేశీయులు ప్రయాణించే ముందు వారి నుండి బకాయి మొత్తాన్ని వసూలు చేయడానికి ఒకే నెట్ వర్క్ ను ఏర్పాటు చేశాయి. త్వరలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కువైట్ మునిసిపాలిటీ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ, ఇతర సంస్థలు ఈ జాబితాలో చేరతాయని నివేదికలో అభిప్రాయపడ్డారు. అనేక మంది ప్రవాసులు వివిధ మంత్రిత్వ శాఖలకు బకాయి మొత్తాన్ని చెల్లించకుండా శాశ్వతంగా దేశం విడిచిపెట్టినందున సంవత్సరంలో ప్రవాసులు 3 బిలియన్ దినార్లకు పైగా డిఫాల్ట్ పడ్డారని నివేదిక స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







