బహ్రెయిన్ లో పెరుగుతున్న కార్లలో వాపింగ్ ధోరణి..ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు..!
- September 08, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లో కార్లలో వాపింగ్ చేసే పెద్దలు, యువకులు సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో కార్లలో పిల్లల ముందే వాపింగ్ చేయడం పెరుగుతుంది. ఇటువంటి ప్రవర్తన పిల్లలను హానికరమైన అలవాట్లకు ప్రేరేపితం చేస్తుందని, దాంతో అభివృద్ధి చెందుతున్న శరీరాలకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కూడా కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. సాంప్రదాయ సిగరెట్ వలె శరీరానికి హానికరం కానప్పటికీ ఇ-సిగరెట్లు కూడా విషపూరిత పదార్థాలను కలిగి ఉంటాయి. అలాగే చుట్టుపక్కల గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇ-సిగరెట్లు హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయని బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ షామిల్ పికె తెలిపారు. ఇ-సిగరెట్ ఉద్గారాలలో హానికరమైన పదార్థాలు ఉన్నాయని అధ్యయనాలు నిరూపించాయి, ఇవి వాపింగ్ చేసే వ్యక్తి చుట్టూ ఉన్న గాలి నాణ్యతను దెబ్బతీస్తాయి, తద్వారా వారి చుట్టూ ఉన్న వ్యక్తులపైనా ఇది ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇ-సిగరెట్ నుండి వచ్చే ఆవిరిలో పార్టిక్యులేట్ మ్యాటర్ (పిఎమ్) 2.5, పిఎమ్ 10, అనిచ్చిత కర్బన సమ్మేళనాలు (టివిఒసి), కార్బన్ డయాక్సైడ్, ప్రొపైలిన్ గ్లైకాల్, హెవీ మెటల్స్, నికోటిన్ ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయని డాక్టర్ చెప్పారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు వాపింగ్ చేసే వారు దూరంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







