టైమ్ టాప్ 100 ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో యూఏఈ మంత్రి..!
- September 08, 2023
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో యూఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ, రిమోట్ వర్క్ అప్లికేషన్స్ మంత్రి ఒమర్ సుల్తాన్ అల్ ఒలామా స్థానం సంపాదించారు. టైమ్ మ్యాగజైన్ తొలిసారి కృత్రిమ మేధస్సు (AI) కోసం ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభావవంతమైన వ్యక్తులతో జాబితాను ప్రకటించింది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో స్థానం పొందిన ఒమర్ సుల్తాన్ అల్ ఒలామాను ప్రశంసించారు. ఇంకా ఈ జాబితాలో అల్ ఒలామాతో పాటు అమెరికా ప్రతినిధులు అన్నా ఎషూ, టెడ్ లియు, యూకే AI ఫౌండేషన్ మోడల్ టాస్క్ఫోర్స్ చైర్ పర్సన్ ఇయాన్ హోగార్త్ ఉన్నారు. వీరితోపాటు ఎలోన్ మస్క్, సామ్ ఆల్ట్మాన్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సీఈఓ అండ్ సహ వ్యవస్థాపకుడు రుమ్మన్ చౌదరి, ప్రముఖ నిపుణులు అబేబా బిర్హానే, ఎన్కోడ్ జస్టిస్కు నాయకత్వం వహించిన 18 ఏళ్ల స్నేహ రేవనూర్, ఇటీవల గూగుల్ ను వదిలిన 76 ఏళ్ల జెఫ్రీ హింటన్ కూడా జాబితాలో ఉన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







