సౌదీ, జపాన్ మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందం
- September 08, 2023
రియాద్: సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా గురువారం రియాద్లోని తన కార్యాలయంలో జపాన్ కౌంటర్ యోషిమాసా హయాషిని కలుసుకున్నారు. సౌదీ-జపానీస్ విదేశాంగ మంత్రుల వ్యూహాత్మక చర్చలకు సంబంధించి ఇరు పక్షాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.ఇది రెండు దేశాలు, వారి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందిని అధికార యంత్రాంగం పేర్కొంది. సౌదీ-జపానీస్ విదేశాంగ మంత్రుల వ్యూహాత్మక చర్చల మొదటి సమావేశానికి ఇద్దరు మంత్రులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, నిరంతర సమన్వయం-సహకారంపై చర్చించారు. రాజకీయ వ్యవహారాల విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ సౌద్ అల్-సతీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆసియా దేశాల జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మహ్మద్ అల్-మత్రాఫీ, సౌదీ అరేబియాలోని జపాన్ రాయబారి ఫుమియో ఇవై ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!







