ఇండియన్ ఎంబసీ చొరవతో చెన్నై చేరుకున్న కార్మికులు
- September 09, 2023
కువైట్ : కువైట్లో చిక్కుకుపోయిన ఇరవై మంది భారతీయ కార్మికులను కువైట్లోని భారత రాయబార కార్యాలయం సహాయంతో భారతదేశానికి తిరిగి పంపారు. ఈ కార్మికులు కువైట్లోని ఒక కంపెనీలో క్లీనింగ్ కార్మికులుగా తక్కువ జీతంతో వసతితో పాటు, ఆహారం లేకుండా పనిచేశారు. వారు కువైట్కు రాకముందు భారతదేశంలోని రిక్రూటింగ్ ఏజెంట్లకు సేవా రుసుముల పేరుతో భారీగా చెల్లించారు. అయితే ఒక సంవత్సరం తర్వాత వారి రెసిడెన్సీ పునరుద్ధరణ కోసం 475 KD చెల్లించమని కంపెనీ వారిని అడిగినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. అప్పటికే వారు తమ ఆహారం, ఇతర ఖర్చులను నిర్వహించడానికి చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో రెసిడెన్సీని రద్దు చేసి, వారిని వెనక్కి పంపి, వారి పాస్పోర్ట్లను నిలిపివేయాలన్న వారి అభ్యర్థనను కూడా కంపెనీ తిరస్కరించింది. ఇంతలో కంపెనీ ఈ కార్మికులకు జీతాలు చెల్లించడం నిలిపివేసింది. పైగా వారి వసతి గృహాలలో నీటి సరఫరా, విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. తోటి కమ్యూనిటీ సభ్యుల మద్దతుగా నిలిచారు. దీంతోపాటు సామాజిక కార్యకర్తలు కార్మికుల దుస్థితిని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా సూచన మేరకు ఎంబసీ అధికారులు వెంటనే కార్మికుల వద్దకు వెళ్లి వారితో చర్చించారు. భారత రాయబార కార్యాలయం చొరవతో కంపెనీ చివరకు కార్మికులందరికీ విమాన టిక్కెట్లను అందించి భారత్ కు వారిని పంపించింది. చెన్నై చేరుకున్న తరువాత వారు కువైట్లోని ఇండియన్ ఎంబసీ, ఎంబసీ అధికారి అనంత ఎస్.ఆర్. అయ్యర్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, సామాజిక కార్యకర్తలు మతి, జి.రాజా, కువైట్లోని భారతీయ సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









