G20 సమ్మిట్ కోసం న్యూఢిల్లీకి చేరుకున్న యూఏఈ ప్రెసిడెంట్
- September 09, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం భారతదేశంలోని న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత రాజధానిలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే థీమ్తో జరిగే 18వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు భారత్ కు చేరుకుంటున్నారు. G20 అధ్యక్షుడి హోదాలో ఉన్న భారతదేశం ఆహ్వానం మేరకు అతిథి దేశంగా యూఏఈ ఈ సంవత్సరం శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటుంది. G20 దేశాలు యూఏఈ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్నారు. చమురుయేతర ఎగుమతుల్లో 43 శాతం, దాని పునః-ఎగుమతుల్లో 39 శాతం వాటా కలిగి ఉన్నాయి.యూఏఈ కమోడిటీ దిగుమతుల్లో 67 శాతం వాటా కూడా వీరిదే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







