యూఏఈ తీరంలో కూలిన హెలికాప్టర్. పైలట్లు మృతి..!
- September 09, 2023
యూఏఈ : యూఏఈ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA)లోని ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ వెల్లడించింది. మృతుల కుటుంబానికి అధికార యంత్రాంగం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. సెప్టెంబర్ 7 రాత్రి 8.30 గంటలకు యూఏఈ తీరంలో హెలికాప్టర్ క్రాష్ అయినట్లు GCAA తెలిపింది. A6-ALD రిజిస్ట్రేషన్ మార్క్తో ఏరోగల్ఫ్ యాజమాన్యంలోని 'బెల్ 212' ఛాపర్ ఈజిప్టు, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ఇద్దరు పైలట్లతో రాత్రి శిక్షణా సెషన్ లో ఉండగా గల్ఫ్ సముద్రంలో కూలిపోయిందని GCAA తెలిపింది. ఇది మొదట అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిందని పేర్కొంది. అధికార యంత్రాంగం శిథిలాల కోసం గాలిస్తుంది. అధికారిక మూలాల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లను నమ్మవద్దని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!







