యూఏఈ తీరంలో కూలిన హెలికాప్టర్. పైలట్లు మృతి..!
- September 09, 2023
యూఏఈ : యూఏఈ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA)లోని ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ వెల్లడించింది. మృతుల కుటుంబానికి అధికార యంత్రాంగం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. సెప్టెంబర్ 7 రాత్రి 8.30 గంటలకు యూఏఈ తీరంలో హెలికాప్టర్ క్రాష్ అయినట్లు GCAA తెలిపింది. A6-ALD రిజిస్ట్రేషన్ మార్క్తో ఏరోగల్ఫ్ యాజమాన్యంలోని 'బెల్ 212' ఛాపర్ ఈజిప్టు, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ఇద్దరు పైలట్లతో రాత్రి శిక్షణా సెషన్ లో ఉండగా గల్ఫ్ సముద్రంలో కూలిపోయిందని GCAA తెలిపింది. ఇది మొదట అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిందని పేర్కొంది. అధికార యంత్రాంగం శిథిలాల కోసం గాలిస్తుంది. అధికారిక మూలాల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లను నమ్మవద్దని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







