యూఏఈ తీరంలో కూలిన హెలికాప్టర్. పైలట్లు మృతి..!
- September 09, 2023
            యూఏఈ : యూఏఈ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA)లోని ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ వెల్లడించింది. మృతుల కుటుంబానికి అధికార యంత్రాంగం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. సెప్టెంబర్ 7 రాత్రి 8.30 గంటలకు యూఏఈ తీరంలో హెలికాప్టర్ క్రాష్ అయినట్లు GCAA తెలిపింది. A6-ALD రిజిస్ట్రేషన్ మార్క్తో ఏరోగల్ఫ్ యాజమాన్యంలోని 'బెల్ 212' ఛాపర్ ఈజిప్టు, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ఇద్దరు పైలట్లతో రాత్రి శిక్షణా సెషన్ లో ఉండగా గల్ఫ్ సముద్రంలో కూలిపోయిందని GCAA తెలిపింది. ఇది మొదట అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిందని పేర్కొంది. అధికార యంత్రాంగం శిథిలాల కోసం గాలిస్తుంది. అధికారిక మూలాల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లను నమ్మవద్దని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 







