మొరాకోలో 7 తీవ్రతతో భూకంపం. 296 మంది మృతి
- September 09, 2023
మొరాకో: శుక్రవారం అర్థరాత్రి మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో ఇప్పటివరకు 296 మందికిపైగా మరణించారు. హై అట్లాస్లోని ఇఘిల్ ప్రాంతంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని మొరాకో జియోఫిజికల్ సెంటర్ తెలిపింది. యుఎస్ జియోలాజికల్ సర్వే భూకంప తీవ్రతను 6.8గా పేర్కొంది. భూకంప కేంద్రం18.5 కిమీ లోతులో ఉందని తెలిపింది. ఇఘిల్, చిన్న వ్యవసాయ గ్రామాలతో కూడిన పర్వత ప్రాంతం. మర్రకేచ్ నుండి నైరుతి దిశలో 70కి.మీ. రాత్రి 11 గంటల తర్వాత (యూఏఈ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతకు భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతు సంఖ్య ఇంక పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం దాటికి అల్ హౌజ్, ఔర్జాజేట్, మర్రకేచ్, అజిలాల్, చిచౌవా మరియు తరౌడాంట్ ప్రావిన్సులు ధ్వంసం అయ్యాయని తెలిపింది. 2004లో ఉత్తర రిఫ్ పర్వతాలలో అల్ హోసీమా సమీపంలో వచ్చిన భూకంపంలో 600 మందికి పైగా మరణించిన భూకంపం తర్వాత మొరాకోలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదేనని స్థానిక అధికారులు చెబుతున్నారు. భూకంపం తర్వాత ప్రజలు షాపింగ్ సెంటర్, రెస్టారెంట్లు మరియు అపార్ట్మెంట్ భవనాల నుండి భయంతో బయటకు పరుగులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









