యూఏఈని ఇండియా, సౌదీ అరేబియా, యూఎస్లకు కలిపే కొత్త షిప్పింగ్, రైల్ కారిడార్
- September 10, 2023
యూఏఈ: భారతదేశాన్ని యూఏఈ, సౌదీ అరేబియా, యూరప్, యుఎస్లకు అనుసంధానించే షిప్పింగ్ మరియు రైలు కారిడార్ను జి20లో నాయకులు ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో శనివారం ఈ ప్రధాన ప్రకటన వెలువడింది. యుఎస్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ మీడియాతో మాట్లాడుతూ.. కారిడార్ ఇంధన వనరులు, డిజిటల్ కమ్యూనికేషన్ల రవాణాను మెరుగుపరచడం ద్వారా పాల్గొనే దేశాల మధ్య ఆర్థిక శ్రేయస్సును పెంచుతుందని అన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ బిడెన్ G20లో అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామిగా, పెట్టుబడిదారుగా వాషింగ్టన్ ను నిలపాలన్న ప్రణాళికలలో ఇది భాగమన్నారు. దౌత్యపరమైన చిక్కులకు అతీతంగా, ఇటువంటి అవస్థాపన ఒప్పందం షిప్పింగ్ సమయం, ఖర్చు, డీజిల్ వినియోగాన్ని తగ్గించగలదని.. వాణిజ్యాన్ని వేగంగా మరియు చౌకగా చేయగలదని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







