యూఏఈని ఇండియా, సౌదీ అరేబియా, యూఎస్లకు కలిపే కొత్త షిప్పింగ్, రైల్ కారిడార్
- September 10, 2023
యూఏఈ: భారతదేశాన్ని యూఏఈ, సౌదీ అరేబియా, యూరప్, యుఎస్లకు అనుసంధానించే షిప్పింగ్ మరియు రైలు కారిడార్ను జి20లో నాయకులు ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో శనివారం ఈ ప్రధాన ప్రకటన వెలువడింది. యుఎస్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ మీడియాతో మాట్లాడుతూ.. కారిడార్ ఇంధన వనరులు, డిజిటల్ కమ్యూనికేషన్ల రవాణాను మెరుగుపరచడం ద్వారా పాల్గొనే దేశాల మధ్య ఆర్థిక శ్రేయస్సును పెంచుతుందని అన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ బిడెన్ G20లో అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామిగా, పెట్టుబడిదారుగా వాషింగ్టన్ ను నిలపాలన్న ప్రణాళికలలో ఇది భాగమన్నారు. దౌత్యపరమైన చిక్కులకు అతీతంగా, ఇటువంటి అవస్థాపన ఒప్పందం షిప్పింగ్ సమయం, ఖర్చు, డీజిల్ వినియోగాన్ని తగ్గించగలదని.. వాణిజ్యాన్ని వేగంగా మరియు చౌకగా చేయగలదని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









