యూఏఈని ఇండియా, సౌదీ అరేబియా, యూఎస్లకు కలిపే కొత్త షిప్పింగ్, రైల్ కారిడార్
- September 10, 2023 
            యూఏఈ: భారతదేశాన్ని యూఏఈ, సౌదీ అరేబియా, యూరప్, యుఎస్లకు అనుసంధానించే షిప్పింగ్ మరియు రైలు కారిడార్ను జి20లో నాయకులు ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో శనివారం ఈ ప్రధాన ప్రకటన వెలువడింది. యుఎస్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ మీడియాతో మాట్లాడుతూ.. కారిడార్ ఇంధన వనరులు, డిజిటల్ కమ్యూనికేషన్ల రవాణాను మెరుగుపరచడం ద్వారా పాల్గొనే దేశాల మధ్య ఆర్థిక శ్రేయస్సును పెంచుతుందని అన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ బిడెన్ G20లో అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామిగా, పెట్టుబడిదారుగా వాషింగ్టన్ ను నిలపాలన్న ప్రణాళికలలో ఇది భాగమన్నారు. దౌత్యపరమైన చిక్కులకు అతీతంగా, ఇటువంటి అవస్థాపన ఒప్పందం షిప్పింగ్ సమయం, ఖర్చు, డీజిల్ వినియోగాన్ని తగ్గించగలదని.. వాణిజ్యాన్ని వేగంగా మరియు చౌకగా చేయగలదని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







