మొరాకో భూకంపం: 1,000 దాటిన మృతుల సంఖ్య
- September 10, 2023
యూఏఈ: మొరాకోలో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో 1,000 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మొరాకో ప్రభుత్వం మర్రాకెచ్ సమీపంలో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1,037కి చేరుకుందని, 1,200 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలలో శుక్రవారం అర్థరాత్రి 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అల్ హౌజ్, ఔర్జాజేట్, మర్రకేచ్, అజిలాల్, చిచౌవా, తారాడంట్ ప్రావిన్స్లలో భూకంపం సంభవించిందని టెలివిజన్ ప్రకటనలో అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. హై అట్లాస్లోని ఇఘిల్ ప్రాంతంలో రాత్రి 11 గంటల (2200 GMT) తర్వాత భూకంపం సంభవించిందని మొరాకో జియోఫిజికల్ సెంటర్ పేర్కొంది. US జియోలాజికల్ సర్వే ప్రకారం.. ప్రకంపనలు కనీసం 12,000 మంది చనిపోయి ఉంటారని, 1960 నుండి మొరాకోలో ఇది అత్యంత ఘోరమైనదని తెలిపింది. మొరకో ప్రభుత్వ ప్రపంచ దేశాలు సంఘీభావం తెలిపాయి. ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన వారు మొరాకో చేరుకుంటున్నారు. అక్టోబరు ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలకు మర్రకేచ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







