మొరాకో భూకంప బాధితులకు యూఏఈ మానవతా సహాయం
- September 10, 2023
యూఏఈ: మొరాకో భూకంప బాధితులకు యూఏఈ అండగా నిలిచింది. యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలతో అల్ దఫ్రా రీజియన్లో ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ఇఆర్సి) అథారిటీ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అత్యవసర మానవతావాదాన్ని అందించాలని ఇఆర్సిని ఆదేశించారు. మొరాకో రాజ్యంలోని కొన్ని ప్రాంతాలలో సంభవించిన భూకంపం వల్ల ప్రభావితమైన వారికి సహాయంగా నిలవాలని ఆదేశించారు. ERC టెంట్లు, దుప్పట్లు, ఆహారం, వైద్య సామాగ్రి మరియు పరిశుభ్రత కిట్లతో సహా గణనీయమైన పరిమాణంలో అవసరమైన సామాగ్రిని తరలించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. విపత్తు వల్ల ప్రభావితమైన ప్రజల అత్యవసర అవసరాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభావిత ప్రాంతాల్లోని మానవతా పరిస్థితులను అంచనా వేయడానికి ERC ఎమర్జెన్నీ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ERC ప్రస్తుతం రబాత్లోని యూఏఈ ఎంబసీతో పాటు ఇతర సమర్థ మొరాకో అధికారులతో సమన్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







