కువైట్లో ఏటా 10వేల మంది చిన్నారులకు స్కిన్ ట్రీట్మెంట్..!
- September 17, 2023
కువైట్: చర్మ వ్యాధులతో బాధపడుతున్న రోగులలో 30 శాతం మంది అటోపిక్ ఎగ్జిమాతో బాధపడుతున్నారని, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 10,000 మందికి పైగా దేశంలోని డెర్మటాలజీ క్లినిక్లకు సంవత్సరానికి రిపోర్ట్ చేస్తున్నారని ముబారక్ హాస్పిటల్ శనివారం ప్రకటించింది. ఆసుపత్రిలోని డెర్మటాలజీ విభాగం అధిపతి డాక్టర్ మనార్ అల్-ఎనేజీ చర్మ వ్యాధికి వ్యతిరేకంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడింది. చర్మ అనారోగ్యానికి గల కారణాలు, చికిత్సల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ప్రయత్నం లక్ష్యం అన్నారు. వంశపారంపర్య సమస్యలు, రోగనిరోధక శక్తి లోపం, చర్మ లోపాలతో చర్మ సమస్యలు అధికంగా వస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..







