ఒకే టిక్కెట్తో ఇండియా, శ్రీలంకలోని 15 గమ్యస్థానాలకు వెళ్లే ఆఫర్
- September 20, 2023
యూఏఈ: ఎమిరేట్స్ మరియు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ రెండు విమానయాన సంస్థల ప్రయాణీకులకు కనెక్టివిటీని పెంచడానికి పరస్పర ఇంటర్లైన్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యంతో కొలంబో, దుబాయ్ ద్వారా ఒకరికొకరు నెట్వర్క్లలో కొత్త పాయింట్లకు యాక్సెస్ను పెంచనుంది. ఎమిరేట్స్ ప్రయాణీకులు కొలంబో ద్వారా శ్రీలంక ఎయిర్లైన్స్ నిర్వహించే 15 ప్రాంతీయ గమ్యస్థానాలను ఇంటర్లైన్ భాగస్వామ్యం అన్లాక్ చేసినందున, ప్రయాణానికి టిక్కెట్లు ఇప్పుడు వెంటనే అమల్లోకి వస్తాయని ఎమిరేట్స్ ప్రతినిధి తెలిపారు. ఇంటర్లైన్ నెట్వర్క్లో రెండు కొత్త భారతీయ నగరాలైన మధురై, తిరుచిరాపల్లి ఉన్నాయి. అలాగే మాల్దీవులలోని గాన్ ద్వీపాన్ని సందర్శించవచ్చు. ఫార్ ఈస్ట్ మరియు దక్షిణాసియా గమ్యస్థానాలలో కొచ్చిన్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మాలే, బ్యాంకాక్, కౌలాలంపూర్, సింగపూర్, జకార్తా, గ్వాంగ్జౌ, సియోల్ మరియు టోక్యో కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







