ఖరీఫ్ ధోఫర్‌ను సందర్శించిన 924,000 మంది పర్యాటకులు

- September 21, 2023 , by Maagulf
ఖరీఫ్ ధోఫర్‌ను సందర్శించిన 924,000 మంది పర్యాటకులు

ధోఫర్: ఖరీఫ్ ధోఫర్ సీజన్ (ఋతుపవనాలు) సీజన్ ప్రారంభం నుండి ఆగస్టు 31 వరకు సందర్శకుల సంఖ్య 924,127కి చేరుకుంది. 2022లో 792,980గా ఉన్న సందర్శకుల సంఖ్యతో పోలిస్తే 17% పెరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రకారం.. ఒమానీ సందర్శకుల సంఖ్య 16.4% పెరిగి 656,119కి చేరుకుంది. GCC సందర్శకులు 2022లో ఇదే కాలంలో 134,309 మందితో పోలిస్తే 156,953కి చేరుకున్నారు. ఇతర దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 111,055గా ఉంది. గతేడాది 95,017 మంది సందర్శకులు వచ్చారు. ల్యాండ్ పోర్ట్ ద్వారా 714,520 మంది సందర్శకులు ధోఫర్ గవర్నరేట్‌కు వచ్చారు. 209,607 మంది సందర్శకులు ఎయిర్ ఫ్లైట్‌ల ద్వారా వచ్చారు. ఇది 2022లో ఇదే కాలంలో విమానాల ద్వారా వచ్చిన వారి సంఖ్యకు 36% పెరిగింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com