పర్యావరణ కాలుష్యానికి పాల్పడే వారికి భారీ జరిమానా

- September 21, 2023 , by Maagulf
పర్యావరణ కాలుష్యానికి పాల్పడే వారికి భారీ జరిమానా

రియాద్ : పర్యావరణాన్ని కలుషితం చేయడం, పర్యావరణ ప్రదేశాలను దెబ్బతీసే వారిపై కఠినమైన శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని సౌదీ పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దెబ్బతిన్న పర్యావరణ ప్రదేశాల పునరావాసం,  కలుషితమైన సైట్‌ల బాగు కోసం కార్యనిర్వాహక నిబంధనలకు ఉల్లంఘనలు, జరిమానాలను జోడించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం.. భూమి మరియు ఇతర పర్యావరణ సైట్‌లను ట్యాంపరింగ్ చేయడం, దెబ్బతీసే వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేస్తారు. ఉల్లంఘనను సరిదిద్దడం, పాడైన సైట్‌లను పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీవ్రతను బట్టి SR10000 నుండి SR100000 వరకు జరిమానా విధించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com