పర్యావరణ కాలుష్యానికి పాల్పడే వారికి భారీ జరిమానా
- September 21, 2023
రియాద్ : పర్యావరణాన్ని కలుషితం చేయడం, పర్యావరణ ప్రదేశాలను దెబ్బతీసే వారిపై కఠినమైన శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని సౌదీ పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దెబ్బతిన్న పర్యావరణ ప్రదేశాల పునరావాసం, కలుషితమైన సైట్ల బాగు కోసం కార్యనిర్వాహక నిబంధనలకు ఉల్లంఘనలు, జరిమానాలను జోడించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం.. భూమి మరియు ఇతర పర్యావరణ సైట్లను ట్యాంపరింగ్ చేయడం, దెబ్బతీసే వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేస్తారు. ఉల్లంఘనను సరిదిద్దడం, పాడైన సైట్లను పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీవ్రతను బట్టి SR10000 నుండి SR100000 వరకు జరిమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







