పర్యావరణ కాలుష్యానికి పాల్పడే వారికి భారీ జరిమానా
- September 21, 2023
రియాద్ : పర్యావరణాన్ని కలుషితం చేయడం, పర్యావరణ ప్రదేశాలను దెబ్బతీసే వారిపై కఠినమైన శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని సౌదీ పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దెబ్బతిన్న పర్యావరణ ప్రదేశాల పునరావాసం, కలుషితమైన సైట్ల బాగు కోసం కార్యనిర్వాహక నిబంధనలకు ఉల్లంఘనలు, జరిమానాలను జోడించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం.. భూమి మరియు ఇతర పర్యావరణ సైట్లను ట్యాంపరింగ్ చేయడం, దెబ్బతీసే వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేస్తారు. ఉల్లంఘనను సరిదిద్దడం, పాడైన సైట్లను పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీవ్రతను బట్టి SR10000 నుండి SR100000 వరకు జరిమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







