సెప్టెంబరు 29న జహ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు
- September 21, 2023
కువైట్: సెప్టెంబర్ 29న జహ్రాలో భారత రాయబార కార్యాలయం కాన్సులర్ క్యాంప్ను నిర్వహించనుంది. కాన్సులర్ క్యాంప్ వాహా ఏరియాలోని డోడీ కిడ్స్ నర్సరీలో (బ్లాక్-02, స్ట్రీట్-06, హౌస్ 2-జహ్రా) ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు జరుగుతుంది. పాస్పోర్ట్ పునరుద్ధరణ, వీసా ఫిర్యాదులు, పిసిసి దరఖాస్తులు, రిలేషన్ షిప్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సంతకం ధృవీకరణ, ఇతర సాధారణ ధృవీకరణ సేవలు, రిజిస్ట్రేషన్ వంటి వివిధ సేవల కోసం నిర్వహించే ఈక్యాంపును జహ్రా ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు వినియోగించుకోవాలని ఎంబసీ తెలిపింది. శిబిరంలో అన్ని ధృవీకరించబడిన పత్రాలు అక్కడికక్కడే ఇవ్వబడతాయి. అన్ని కాన్సులర్ సేవలకు నగదు చెల్లింపులు మాత్రమే ఆమోదించబడతాయని ఎంబసీ పేర్కొంది. అలాగే శిబిరంలో భారతీయ వైద్యుల ఫోరమ్లోని వైద్యులు భారతీయ జాతీయులకు ఉచిత వైద్య పరీక్షలను అందించనున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







