సెప్టెంబరు 29న జహ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు
- September 21, 2023
కువైట్: సెప్టెంబర్ 29న జహ్రాలో భారత రాయబార కార్యాలయం కాన్సులర్ క్యాంప్ను నిర్వహించనుంది. కాన్సులర్ క్యాంప్ వాహా ఏరియాలోని డోడీ కిడ్స్ నర్సరీలో (బ్లాక్-02, స్ట్రీట్-06, హౌస్ 2-జహ్రా) ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు జరుగుతుంది. పాస్పోర్ట్ పునరుద్ధరణ, వీసా ఫిర్యాదులు, పిసిసి దరఖాస్తులు, రిలేషన్ షిప్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సంతకం ధృవీకరణ, ఇతర సాధారణ ధృవీకరణ సేవలు, రిజిస్ట్రేషన్ వంటి వివిధ సేవల కోసం నిర్వహించే ఈక్యాంపును జహ్రా ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు వినియోగించుకోవాలని ఎంబసీ తెలిపింది. శిబిరంలో అన్ని ధృవీకరించబడిన పత్రాలు అక్కడికక్కడే ఇవ్వబడతాయి. అన్ని కాన్సులర్ సేవలకు నగదు చెల్లింపులు మాత్రమే ఆమోదించబడతాయని ఎంబసీ పేర్కొంది. అలాగే శిబిరంలో భారతీయ వైద్యుల ఫోరమ్లోని వైద్యులు భారతీయ జాతీయులకు ఉచిత వైద్య పరీక్షలను అందించనున్నారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









