ఇండియన్ స్కూల్ మస్కట్‌కు కొత్త ప్రిన్సిపాల్

- September 22, 2023 , by Maagulf
ఇండియన్ స్కూల్ మస్కట్‌కు కొత్త ప్రిన్సిపాల్

మస్కట్: ఇండియన్ స్కూల్ మస్కట్‌కి కొత్త ప్రిన్సిపాల్ గా మిస్టర్ రాకేష్ జోషి నియమితులయ్యారు. అకడమీషియన్ పార్ ఎక్సలెన్స్, మిస్టర్ జోషి గణితం, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఎడ్యుకేషన్‌లో ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఉపాధ్యాయుడిగా, ప్రిన్సిపాల్‌గా 30 సంవత్సరాలకు పైగా నైపుణ్యం కలిగి ఉన్నారు.  హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం, సిమ్లా పూర్వ విద్యార్థి.. జోషి 1992లో భారతదేశంలోని విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవోదయ విద్యాలయంలో గణిత ఉపాధ్యాయునిగా విద్యా రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ పాటియాలా, అపీజే స్కూల్ నవీ ముంబై మరియు జపాన్‌లోని ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, టోక్యో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఇండియన్ స్కూల్ మస్కట్ పగ్గాలు చేపట్టడానికి ముందు అతను న్యూ ఢిల్లీలోని ఏపీజే ఎడ్యుకేషన్ సొసైటీకి ప్రాంతీయ అకడమిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. CBSE, న్యూఢిల్లీ అతని విద్యా నాయకత్వ బాధ్యతలను గుర్తించి 2015లో ‘ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని’ ప్రదానం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com