పబ్లిక్ పార్కింగ్ ప్రాజెక్ట్ కోసం 3,300 సెన్సార్ల ఇన్స్టాల్
- September 23, 2023
దోహా: పబ్లిక్ పార్కింగ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ను అమలు చేయడానికి, వెస్ట్ బే, కార్నిచ్ మరియు సెంట్రల్ దోహాలో సుమారు 3,300 వాహనాల పార్కింగ్ సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 18,000 వాహనాలకు పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన విధానాలను పూర్తి చేసిన వెంటనే ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. స్మార్ట్ ఖతార్ ప్రోగ్రామ్ (TASMU) ప్రాజెక్ట్లోని స్మార్ట్ పార్కింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పార్కింగ్ను రిజర్వ్ చేయడం, దానికి ఛార్జీలు వసూలు చేయడం, ఉల్లంఘనలను నియంత్రించడం, ఇందులోని చట్టం మరియు మంత్రివర్గ నిర్ణయాలను అనుసరించి జరిమానాలు విధించడం వంటి అన్ని అంశాలను పరిష్కరిస్తున్నట్లు నిర్ధారించడానికి పని జరుగుతోందన్నారు. మునిసిపాలిటీ ప్రధాన కార్యాలయంలో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాహనాల పార్కింగ్ను నియంత్రించే ప్రాజెక్ట్ పూర్తి దశలను అధికారులు ప్రకటించారు. మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని టెక్నికల్ ఆఫీస్ డైరెక్టర్ ఇంజి తారిఖ్ అల్ తమీమి మాట్లాడుతూ.. మొదటి దశలో 3,300 పార్కింగ్ సెన్సార్లు పూర్తయ్యాయని( 100%) పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన దశలను పూర్తి చేసేందుకు అన్ని ప్రాధాన్య ప్రాంతాలలో పనులు జరుగుతున్నాయన్నారు. దేశంలో వాహనాల పార్కింగ్ నిర్వహణ అనేక సానుకూల సూచికలను సాధించడంతోపాటు నగరాలు, నివాస పరిసరాల్లో జీవన నాణ్యతను మెరుగుపరచడంలో దోహదపడుతుందని అల్ తమీమి వివరించారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







