‘గుంటూరు కారం’లో కాజల్ గెస్ట్ రోల్ నిజమేనా.?
- September 23, 2023
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘గుంటూరు కారం’కి అనేక రకాల అదనపు గ్లామర్ అద్దబోతున్నారనీ తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో ఫుల్ డోస్ గ్లామర్ వుంది ఇద్దరు హీరోయిన్లతో.
శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఇద్దరే.. హాట్ అండ్ సో హాట్. ఇక, ఇప్పుడు మరో గ్లామర్ యాడ్ అవుతోందట.
చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓ స్టార్ హీరోయిన్తో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వాలనుకున్నారట. అది కాజల్ అయితే బాగుంటుందని మహేష్ బాబు సూచించాడట.
కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఈ పాత్ర వచ్చి పోతుందట. ఇది సినిమాకి ఓ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనీ అంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ‘గుంటూరు కారం’.
బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో చిత్ర యూనిట్ బిజీగా వుంది. సంక్రాంతికి సినిమాని ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









