GCC నివాసితులకు త్వరలో ఒకే వీసా
- September 27, 2023
యూఏఈ: ఆరు దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) తమ నివాసితులు సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించేలా ఒకే వీసా విధానాన్ని పరిశీలిస్తోందని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రీ తెలిపారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ ప్రకటించింది. అతి త్వరలో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం GCC దేశాల పౌరులు మాత్రమే యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్లకు వీసా రహిత ప్రయాణాన్ని ఆనందిస్తున్నారు. ఈ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు ప్రతి సభ్య దేశానికి ప్రయాణించడానికి వీసా కోసం దరఖాస్తు చేయాలి. కొన్ని జాతీయులకు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ సదుపాయం అందుబాటులో ఉంది. మంగళవారం అబుధాబిలో జరిగిన ఫ్యూచర్ హాస్పిటాలిటీ సమ్మిట్లో అల్ మర్రి పాన్-జిసిసి సింగిల్ వీసాపై మాట్లాడారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







