GCC నివాసితులకు త్వరలో ఒకే వీసా
- September 27, 2023
యూఏఈ: ఆరు దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) తమ నివాసితులు సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించేలా ఒకే వీసా విధానాన్ని పరిశీలిస్తోందని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రీ తెలిపారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ ప్రకటించింది. అతి త్వరలో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం GCC దేశాల పౌరులు మాత్రమే యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్లకు వీసా రహిత ప్రయాణాన్ని ఆనందిస్తున్నారు. ఈ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు ప్రతి సభ్య దేశానికి ప్రయాణించడానికి వీసా కోసం దరఖాస్తు చేయాలి. కొన్ని జాతీయులకు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ సదుపాయం అందుబాటులో ఉంది. మంగళవారం అబుధాబిలో జరిగిన ఫ్యూచర్ హాస్పిటాలిటీ సమ్మిట్లో అల్ మర్రి పాన్-జిసిసి సింగిల్ వీసాపై మాట్లాడారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









