GCC నివాసితులకు త్వరలో ఒకే వీసా
- September 27, 2023
యూఏఈ: ఆరు దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) తమ నివాసితులు సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించేలా ఒకే వీసా విధానాన్ని పరిశీలిస్తోందని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రీ తెలిపారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ ప్రకటించింది. అతి త్వరలో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం GCC దేశాల పౌరులు మాత్రమే యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్లకు వీసా రహిత ప్రయాణాన్ని ఆనందిస్తున్నారు. ఈ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు ప్రతి సభ్య దేశానికి ప్రయాణించడానికి వీసా కోసం దరఖాస్తు చేయాలి. కొన్ని జాతీయులకు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ సదుపాయం అందుబాటులో ఉంది. మంగళవారం అబుధాబిలో జరిగిన ఫ్యూచర్ హాస్పిటాలిటీ సమ్మిట్లో అల్ మర్రి పాన్-జిసిసి సింగిల్ వీసాపై మాట్లాడారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







