ఇరాక్ లో పెళ్లి మండపంలో అగ్ని ప్రమాదం..100 మందికి పైగా మృతి
- September 27, 2023
బాగ్దాద్: ఉత్తర ఇరాక్లో క్రైస్తవ వివాహానికి ఆతిథ్యం ఇస్తున్న హాలులో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 100 మంది మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇరాక్లోని నినెవే ప్రావిన్స్లోని హమ్దానియా ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అది రాజధాని బాగ్దాద్కు వాయువ్యంగా 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోసుల్ నగరానికి వెలుపల క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతం. ప్రమాదం నుంచి బయటపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్-బదర్ తెలిపారు. ప్రధాన మంత్రి మహ్మద్ షియా అల్-సుదానీ అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









