ఇరాక్ లో పెళ్లి మండపంలో అగ్ని ప్రమాదం..100 మందికి పైగా మృతి
- September 27, 2023
బాగ్దాద్: ఉత్తర ఇరాక్లో క్రైస్తవ వివాహానికి ఆతిథ్యం ఇస్తున్న హాలులో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 100 మంది మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇరాక్లోని నినెవే ప్రావిన్స్లోని హమ్దానియా ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అది రాజధాని బాగ్దాద్కు వాయువ్యంగా 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోసుల్ నగరానికి వెలుపల క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతం. ప్రమాదం నుంచి బయటపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్-బదర్ తెలిపారు. ప్రధాన మంత్రి మహ్మద్ షియా అల్-సుదానీ అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







