ఇరాక్ లో పెళ్లి మండపంలో అగ్ని ప్రమాదం..100 మందికి పైగా మృతి
- September 27, 2023
బాగ్దాద్: ఉత్తర ఇరాక్లో క్రైస్తవ వివాహానికి ఆతిథ్యం ఇస్తున్న హాలులో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 100 మంది మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇరాక్లోని నినెవే ప్రావిన్స్లోని హమ్దానియా ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అది రాజధాని బాగ్దాద్కు వాయువ్యంగా 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోసుల్ నగరానికి వెలుపల క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతం. ప్రమాదం నుంచి బయటపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్-బదర్ తెలిపారు. ప్రధాన మంత్రి మహ్మద్ షియా అల్-సుదానీ అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక