జనసేన పార్టీ బహ్రెయిన్ కన్వీనర్ గా రాయుడు వెంకటేశ్వరరావు
- September 29, 2023
మనామా: జనసేన పార్టీ బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా ఆలమూరు మండలం చెముడు లంక గ్రామానికి చెందిన రాయుడు వెంకటేశ్వరరావును నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.జనసేన పార్టీ గల్ఫ్ దేశాల ప్రాంతీయ కన్వీనర్లను నియమిస్తూ గురువారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు.దీనిలో భాగంగా బహ్రెయిన్ లో ఉద్యోగరీత్యా స్థిరపడిన రాయుడు వెంకటేశ్వరరావు గల్ఫ్ దేశాల జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు.పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నరాయుడు వెంకటేశ్వరరావు సేవలను పార్టీ గుర్తించి బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా నియమితులైన రాయుడు వెంకటేశ్వర రావు ను కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు అభినందించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









