జనసేన పార్టీ బహ్రెయిన్ కన్వీనర్ గా రాయుడు వెంకటేశ్వరరావు
- September 29, 2023
మనామా: జనసేన పార్టీ బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా ఆలమూరు మండలం చెముడు లంక గ్రామానికి చెందిన రాయుడు వెంకటేశ్వరరావును నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.జనసేన పార్టీ గల్ఫ్ దేశాల ప్రాంతీయ కన్వీనర్లను నియమిస్తూ గురువారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు.దీనిలో భాగంగా బహ్రెయిన్ లో ఉద్యోగరీత్యా స్థిరపడిన రాయుడు వెంకటేశ్వరరావు గల్ఫ్ దేశాల జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు.పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నరాయుడు వెంకటేశ్వరరావు సేవలను పార్టీ గుర్తించి బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా నియమితులైన రాయుడు వెంకటేశ్వర రావు ను కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు అభినందించారు.
తాజా వార్తలు
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు







