ఎక్స్పో సిటీలో ‘గార్డెన్ ఇన్ ది స్కై’ తాత్కాలికంగా మూసివేత
- October 01, 2023
దుబాయ్: ఎక్స్పో సిటీ దుబాయ్ తన రెండు ప్రసిద్ధ ఆకర్షణలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. "గార్డెన్ ఇన్ ది స్కై మరియు రషీద్స్ ప్లేగ్రౌండ్" అక్టోబర్ 1 నుండి తాత్కాలికంగా "పాజ్" చేయబడుతుందని తెలిపింది. వాటిని తిరిగి ఎప్పుడు తెరుస్తారో వెల్లడించలేదు. ఈ సంవత్సరం మే నెలలో ఎక్స్పో సిటీ దుబాయ్ సాధారణ నిర్వహణ కోసం గార్డెన్ ఇన్ ది స్కైని తాత్కాలికంగా మూసివేసింది. ఆగస్టు నెల ప్రారంభంలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
'గార్డెన్ ఇన్ ది స్కై' అనేది తిరిగే పరిశీలన టవర్. ఇది సందర్శకులను భూమి నుండి 55 మీటర్ల ఎత్తులో పైకి తీసుకెళ్లుతుంది. ఇది నగరం వ్యూని అందిస్తుంది. జూబ్లీ పార్క్లోని రషీద్ ప్లేగ్రౌండ్ పిల్లలకు ప్రత్యేకం. ఇది సముద్ర-నేపథ్య సాహసం, స్ప్రింగ్లపై సొరచేపలు, వేల్ స్లైడ్లు, ఓషన్ లైనర్లు , ఇంటరాక్టివ్ 3D చిట్టడవి నమూనాను కలిగి ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







