టీడీపీ ‘మోత మొగిద్దాం’ పిలుపు అపూర్వ స్పందన
- October 01, 2023
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసన గా టీడీపీ ఇచ్చిన ‘మోత మొగిద్దాం’ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చిన. ఏపీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి..మోత మోగించారు. ప్లేట్స్ ఫై సౌండ్ చేయడం..విజిల్ చేయడం ..డ్రమ్స్ కొట్టడం వంటివి చేసి తమ సంఘీభావం తెలిపారు. నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు ఢిల్లీ లో మోత మోగించగా..నారా బ్రహ్మణి రాజమండ్రి లో , నారా భువనేశ్వరి హైదరాబాద్ లో మోత మోగించారు.
రాజమండ్రిలో లోకేష్ క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన ‘మోత మోగిద్దాం’ కార్యక్రమంలో జనాలతో కలిసి బ్రాహ్మణి పాల్గొన్నారు. సందర్భంగా ప్రభుత్వం తీరును తప్పుపడుతు, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఈలలతో మోత మోగించారు. క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్ధతుగా డబ్బులు, ఈలలతో మోత మోగించారు. సరిగ్గా 7 గంటలకు క్యాంపు కార్యాలయం బయట వీరంతా ఈలలు, డప్పుల శబ్ధాలు చేశారు. కంచాలు కొడుతూ, విజిల్స్, బూరెలు ఊదుతూ చంద్రబాబుకు తమ మద్ధతు ప్రకటించారు టీడీపీ శ్రేణులు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







