రికార్డు స్థాయిలో 74 లక్షల బ్యాడ్ అకౌంట్ల పై నిషేధించిన వాట్సాప్
- October 02, 2023
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కొత్త ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా ఆగస్టు నెలలో భారతదేశంలో రికార్డు స్థాయిలో 74 లక్షల బ్యాడ్ అకౌంట్లను నిషేధించింది. ఆగస్టు 1-31 మధ్య, కంపెనీ 7,420,748 ఖాతాలను బ్యాన్ చేసింది. వీటిలో దాదాపు 3,506,905 ఖాతాలు ముందుగానే నిషేధించబడ్డాయని, యూజర్స్ నుండి కంప్లయింట్స్ రాకముందే, వాట్సాప్ ఈ చర్యలకు ఉపక్రమించింది. దేశంలో 500 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్ఫారమ్, దేశంలో ఆగస్టులో రికార్డు స్థాయిలో 14వేల 767 ఫిర్యాదులను అందుకుంది. “అకౌంట్స్ యాక్షన్డ్” అంటే వాట్సాప్ రిపోర్ట్ ఆధారంగా రిమెడియల్ చర్య తీసుకున్న రిపోర్ట్లను సూచిస్తుంది. ఈ చర్య తీసుకోవడం అంటే ఖాతాను బ్యాన్ చేయడం లేదా దాని ఫలితంగా గతంలో బ్యాన్ చేసిన ఖాతా పునరుద్ధరించబడడాన్ని సూచిస్తుంది. "ఈ వినియోగదారు-భద్రతా నివేదికలో స్వీకరించబడిన వినియోగదారు ఫిర్యాదుల వివరాలు, వాట్సాప్ తీసుకున్న సంబంధిత చర్యలు, అలాగే మా ప్లాట్ఫారమ్లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి WhatsApp స్వంత నివారణ చర్యలు ఉన్నాయి" అని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, కంపెనీ ఆగస్టులో దేశంలోని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ నుండి ఒక ఆర్డర్ మాత్రమే పొందింది. లక్షలాది మంది భారతీయ సోషల్ మీడియా వినియోగదారులకు సాధికారత కల్పించే ప్రయత్నంలో, కంటెంట్, ఇతర సమస్యలకు సంబంధించి వారి ఆందోళనలను పరిశీలించే గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని కేంద్రం ఇటీవల ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన ప్యానెల్, బిగ్ టెక్ కంపెనీలను మచ్చిక చేసుకునేందుకు దేశంలోని డిజిటల్ చట్టాలను పటిష్టం చేసేందుకు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల నిర్ణయాలకు వ్యతిరేకంగా వినియోగదారుల అప్పీళ్లను పరిశీలిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









