ఎస్పీ కార్యాలయాన్ని, డబుల్ బెడ్రూం ఇండ్ల‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

- October 03, 2023 , by Maagulf
ఎస్పీ కార్యాలయాన్ని, డబుల్ బెడ్రూం ఇండ్ల‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

జ‌గిత్యాల: ఈరోజు మంత్రి కెటిఆర్ జ‌గిత్యాల జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. పర్యటనలో భాగంగా జ‌గిత్యాల‌లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 40 కోట్ల‌తో నిర్మించిన జిల్లా పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యాన్ని, నూకపెల్లి వద్ద 280 కోట్లతో నిర్మించిన 4,520 డబుల్‌ బెడ్రూం ఇండ్ల కెసిఆర్‌ కాలనీని, మార్కెట్‌ యార్డు ఆవరణలో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్‌ను హోంమంత్రి మ‌హ‌ముద్ అలీతో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్, ఎమ్మెల్యేలు డాక్ట‌ర్ సంజ‌య్, బాల్క సుమ‌న్, సుంకె ర‌విశంక‌ర్‌, విద్యాసాగ‌ర్ రావు, ఎంపీ వెంక‌టేశ్ నేత‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com