వెలగపండుతో అలసట నీరసం మటుమాయం.!
- October 03, 2023
వెలగపండు లేదా వుడ్ యాపిల్గా పిలవబడే ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. వినాయక చవితి రోజు ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టే పండ్లలో వెలగపండు మొదటి స్థానంలో వుంటుంది.
వినాయకునికి నైవేద్యంగా పెట్టడమే కాదండోయ్.. మన ఆహారంలోనూ భాగం చేసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
వెలగపండులో అనేక రకాల ఆయుర్వేద గుణాలున్నాయట. సీజన్ మార్పుల వల్ల వచ్చే వైరల్ జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి వెలగ పండు కాపాడుతుందట.
అలసట, నీరసాన్ని దరి చేరనీయకుండా చేస్తుందట. జ్వరాల కారణంగా వచ్చే అలసటను తగ్గించుకోవడానికి బెల్లం కలిపిన వెలగపండు జ్యూస్ తాగితే మంచి ఉపశమనం వుంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యల్ని తగ్గించి, శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది వెలగ పండు. అలాగే, ఈ పండులో అత్యధిక మోతాదులో ఫైబర్ కంటెంట్ వుండడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
అందుకే ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ పండును ఖచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







