వెలగపండుతో అలసట నీరసం మటుమాయం.!
- October 03, 2023
వెలగపండు లేదా వుడ్ యాపిల్గా పిలవబడే ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. వినాయక చవితి రోజు ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టే పండ్లలో వెలగపండు మొదటి స్థానంలో వుంటుంది.
వినాయకునికి నైవేద్యంగా పెట్టడమే కాదండోయ్.. మన ఆహారంలోనూ భాగం చేసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
వెలగపండులో అనేక రకాల ఆయుర్వేద గుణాలున్నాయట. సీజన్ మార్పుల వల్ల వచ్చే వైరల్ జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి వెలగ పండు కాపాడుతుందట.
అలసట, నీరసాన్ని దరి చేరనీయకుండా చేస్తుందట. జ్వరాల కారణంగా వచ్చే అలసటను తగ్గించుకోవడానికి బెల్లం కలిపిన వెలగపండు జ్యూస్ తాగితే మంచి ఉపశమనం వుంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యల్ని తగ్గించి, శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది వెలగ పండు. అలాగే, ఈ పండులో అత్యధిక మోతాదులో ఫైబర్ కంటెంట్ వుండడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
అందుకే ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ పండును ఖచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







