వెలగపండుతో అలసట నీరసం మటుమాయం.!
- October 03, 2023
వెలగపండు లేదా వుడ్ యాపిల్గా పిలవబడే ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. వినాయక చవితి రోజు ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టే పండ్లలో వెలగపండు మొదటి స్థానంలో వుంటుంది.
వినాయకునికి నైవేద్యంగా పెట్టడమే కాదండోయ్.. మన ఆహారంలోనూ భాగం చేసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
వెలగపండులో అనేక రకాల ఆయుర్వేద గుణాలున్నాయట. సీజన్ మార్పుల వల్ల వచ్చే వైరల్ జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి వెలగ పండు కాపాడుతుందట.
అలసట, నీరసాన్ని దరి చేరనీయకుండా చేస్తుందట. జ్వరాల కారణంగా వచ్చే అలసటను తగ్గించుకోవడానికి బెల్లం కలిపిన వెలగపండు జ్యూస్ తాగితే మంచి ఉపశమనం వుంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యల్ని తగ్గించి, శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది వెలగ పండు. అలాగే, ఈ పండులో అత్యధిక మోతాదులో ఫైబర్ కంటెంట్ వుండడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
అందుకే ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ పండును ఖచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









