వెలగపండుతో అలసట నీరసం మటుమాయం.!
- October 03, 2023
వెలగపండు లేదా వుడ్ యాపిల్గా పిలవబడే ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. వినాయక చవితి రోజు ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టే పండ్లలో వెలగపండు మొదటి స్థానంలో వుంటుంది.
వినాయకునికి నైవేద్యంగా పెట్టడమే కాదండోయ్.. మన ఆహారంలోనూ భాగం చేసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
వెలగపండులో అనేక రకాల ఆయుర్వేద గుణాలున్నాయట. సీజన్ మార్పుల వల్ల వచ్చే వైరల్ జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి వెలగ పండు కాపాడుతుందట.
అలసట, నీరసాన్ని దరి చేరనీయకుండా చేస్తుందట. జ్వరాల కారణంగా వచ్చే అలసటను తగ్గించుకోవడానికి బెల్లం కలిపిన వెలగపండు జ్యూస్ తాగితే మంచి ఉపశమనం వుంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యల్ని తగ్గించి, శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది వెలగ పండు. అలాగే, ఈ పండులో అత్యధిక మోతాదులో ఫైబర్ కంటెంట్ వుండడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
అందుకే ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ పండును ఖచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









