ఎక్స్‌పో సిటీ దుబాయ్ 6 పెవిలియన్లు మూసివేత

- October 03, 2023 , by Maagulf
ఎక్స్‌పో సిటీ దుబాయ్ 6 పెవిలియన్లు మూసివేత

దుబాయ్ : ఎక్స్‌పో సిటీ దుబాయ్‌లోని ఆరు పెవిలియన్‌లను  COP28 హోస్టింగ్ నిర్వాహణ కార్యక్రమాల కారణంగా 12 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెర్రా, అలీఫ్, విజన్, ఉమెన్స్ పెవిలియన్స్, స్టోరీస్ ఆఫ్ నేషన్స్ , లతీఫాస్ అడ్వెంచర్‌లను నవంబర్ 18 నుండి నవంబర్ 29 వరకు మూసివేయనున్నట్లు ఎక్స్‌పో సిటీ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. ఎక్స్‌పో సిటీ దుబాయ్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగే COP28 లేదా యూఎన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) పార్టీల 28వ సమావేశానికి వేదిక కానున్న విషయం తెలిసిందే.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com