బతుకమ్మ వేడుకల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
- October 03, 2023
హైదరాబాద్: భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ను మంగళవారం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..బతుకమ్మకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడంలో విదేశాల్లో ఉన్నటువంటి భారత్ జాగృతి కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పండగలకు వివిధ దేశాల్లో ప్రాచుర్యం కలగడం సంతోషంగా ఉందని తెలిపారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన భారత జాగృతి యూకే విభాగాన్ని కల్వకుంట్ల కవిత అభినందించారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి యూకే అధ్యక్షుడు బల్మురి సుమన్, టీ ఎస్ ఫుడ్స్ చైర్మన్ అండ్ భారత్ జాగృతి వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సాగర, భారత్ జాగృతి జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత అనేక సంవ త్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. అందులో భాగంగా ప్రతి ఏటా భారత్ జాగృతి యూకే విభాగం ఆ దేశంలో మెగా బతుకమ్మ పేరిట వేడుకలు నిర్వహిస్తున్నది. ఈ నెల 21న నిర్వహించబోయే వేడుకలకు పెద్ద ఎత్తున తెలంగాణ వారితోపాటు, ప్రవాసీ భారతీయులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!









