బ్యాంకాక్‌లో ఒమన్ పౌరుల సేఫ్టీపై ఎంబసీ కీలక ప్రకటన

- October 04, 2023 , by Maagulf
బ్యాంకాక్‌లో ఒమన్ పౌరుల సేఫ్టీపై ఎంబసీ కీలక ప్రకటన

మస్కట్: అక్టోబర్ 3న థాయ్ లాండ్ రాజధానిలోని వాణిజ్య కేంద్రాలలో ఒకదానిలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత బ్యాంకాక్‌లోని ఒమానీ పౌరులు క్షేమంగా ఉన్నారని థాయిలాండ్‌లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఎంబసీ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. రాజధాని బ్యాంకాక్‌లోని వాణిజ్య కేంద్రంలో మంగళవారం సాయంత్రంన కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఒమానీ పౌరులు ఎవరూ గాయపడలేదని, బ్యాంకాక్ లోని ఒమానీలు క్షేమంగా ఉన్నారని ఎంబసీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com