TSRTC ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ
- October 04, 2023
హైదరాబాద్: తమ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.
"టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది." అని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ తెలిపారు.
తాజా వార్తలు
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- డాలస్లోని మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించిన జయరాం కోమటి
- ఖతార్ లో ఔట్ సైడ్ వర్క్ పై బ్యాన్..కీలక సూచనలు..!!
- గ్లోబల్ ఎక్స్ పోర్టు సఫ్లై చైన్ స్టార్టప్ ఇండెక్స్..ఒమన్ కు ఫస్ట్ ర్యాంక్..!!
- గాయని లక్ష్యంగా..అభ్యంతరకరమైన స్నాప్చాట్ పోస్టులు..కవికి జైలుశిక్ష..!!
- కువైట్ జలాల్లో షార్క్.. ఈపీఏ క్లారిటీ..!!
- షార్జాలో బాలుడు మృతి..సీసీటీవీ ఫుటేజీతో విచారణ వేగవంతం..!!
- ఇన్వెస్ట్ మెంట్ రౌండ్స్.. ముందస్తు నోటిఫికేషన్ తప్పనిసరి: SAMA
- తెలంగాణను దేశానికే ఆదర్శంగా మార్చినం: కేసీఆర్









