బాలయ్య తర్వాత అనిల్ రావిపూడి.! ఎవరితోనో తెలుసా.?
- October 05, 2023
అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫైనల్ టచ్లో బిజీగా వుంది ‘భగవంత్ కేసరి’ టీమ్.
ఇదిలా వుంటే, ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తాడు.? అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తోంది.
అనిల్ రావిపూడి ఓ స్టోరీ లైన్తో మెగాస్టార్ చిరంజీవిని లాక్ చేసి పెట్టాడన్న ప్రచారం వుంది. అవును నిజమే.. చిరంజీవి కోసం ఓ స్టోరీ లైన్ సిద్ధం చేశారట. అది చిరంజీవికి కూడా బాగా నచ్చేసిందట. కలిసి చేద్దామని అన్నారట.
ఈ ప్రాజెక్ట్కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాబోతున్నారట. ‘భగవంత్ కేసరి’ పూర్తయిన వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కించేయాలనుకుంటున్నారట అనిల్ రావిపూడి. ప్రస్తుతం చిరంజీవి ఇమ్మీడియట్గా చేయబోతున్న ప్రాజెక్ట్ ‘బింబిసార’ ఫేమ్ వశిష్టతో. ఇటీవల మోకాలి సర్జరీ కారణంగా రెస్ట్ తీసుకుంటున్న చిరంజీవి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కోసం సంసిద్ధం కానున్నారు.
చాలా తక్కువ టైమ్లోనే ఈ సినిమా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనూ చిరంజీవి ఓ సినిమా చేయాల్సి వుంది. మరి, వశిష్ట సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్ని ముందుగా చిరంజీవి పట్టాలెక్కిస్తారో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







