బాలయ్య తర్వాత అనిల్ రావిపూడి.! ఎవరితోనో తెలుసా.?
- October 05, 2023
అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫైనల్ టచ్లో బిజీగా వుంది ‘భగవంత్ కేసరి’ టీమ్.
ఇదిలా వుంటే, ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తాడు.? అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తోంది.
అనిల్ రావిపూడి ఓ స్టోరీ లైన్తో మెగాస్టార్ చిరంజీవిని లాక్ చేసి పెట్టాడన్న ప్రచారం వుంది. అవును నిజమే.. చిరంజీవి కోసం ఓ స్టోరీ లైన్ సిద్ధం చేశారట. అది చిరంజీవికి కూడా బాగా నచ్చేసిందట. కలిసి చేద్దామని అన్నారట.
ఈ ప్రాజెక్ట్కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాబోతున్నారట. ‘భగవంత్ కేసరి’ పూర్తయిన వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కించేయాలనుకుంటున్నారట అనిల్ రావిపూడి. ప్రస్తుతం చిరంజీవి ఇమ్మీడియట్గా చేయబోతున్న ప్రాజెక్ట్ ‘బింబిసార’ ఫేమ్ వశిష్టతో. ఇటీవల మోకాలి సర్జరీ కారణంగా రెస్ట్ తీసుకుంటున్న చిరంజీవి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కోసం సంసిద్ధం కానున్నారు.
చాలా తక్కువ టైమ్లోనే ఈ సినిమా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనూ చిరంజీవి ఓ సినిమా చేయాల్సి వుంది. మరి, వశిష్ట సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్ని ముందుగా చిరంజీవి పట్టాలెక్కిస్తారో చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి









