GCC-EU జాయింట్ మినిస్టీరియల్ సమావేశానికి ఒమన్ ఆతిథ్యం
- October 06, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ 2023 అక్టోబర్ 9, 10 తేదీలలో EU-GCC జాయింట్ మినిస్టీరియల్ కౌన్సిల్ 27వ సెషన్ను నిర్వహించనుంది. GCC పక్షానికి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ నేతృత్వం వహిస్తుండగా..ఈయూ పక్షానికి యూరోపియన్ యూనియన్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలసీ ఉన్నత ప్రతినిధి జోసెఫ్ బోరెల్ నాయకత్వం వహిస్తారు. ఈ సమావేశానికి జిసిసి సెక్రటరీ జనరల్ జాసిమ్ మహ్మద్ అల్ బుదైవి హాజరుకానున్నారు. యూరోపియన్ యూనియన్ , GCC రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముప్పైకి పైగా అధికారిక ప్రతినిధి బృందాలు సమావేశంలో పాల్గొంటాయి. ఇందులో యూరోపియన్ కమిషన్, GCC సెక్రటేరియట్ జనరల్స్ కూడా పాల్గొంటారు. సమావేశంలో మంత్రులు ఉమ్మడి ప్రాధాన్యతలపై చర్చిస్తారు. EU-GCC వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషిస్తారు. భద్రత మరియు శాంతి సమస్యలపై చర్చిస్తారు. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ , మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంపై ఉన్న సంక్షిష్టతలపై ఫోకస్ చేస్తారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









