GCC-EU జాయింట్ మినిస్టీరియల్ సమావేశానికి ఒమన్ ఆతిథ్యం
- October 06, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ 2023 అక్టోబర్ 9, 10 తేదీలలో EU-GCC జాయింట్ మినిస్టీరియల్ కౌన్సిల్ 27వ సెషన్ను నిర్వహించనుంది. GCC పక్షానికి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ నేతృత్వం వహిస్తుండగా..ఈయూ పక్షానికి యూరోపియన్ యూనియన్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలసీ ఉన్నత ప్రతినిధి జోసెఫ్ బోరెల్ నాయకత్వం వహిస్తారు. ఈ సమావేశానికి జిసిసి సెక్రటరీ జనరల్ జాసిమ్ మహ్మద్ అల్ బుదైవి హాజరుకానున్నారు. యూరోపియన్ యూనియన్ , GCC రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముప్పైకి పైగా అధికారిక ప్రతినిధి బృందాలు సమావేశంలో పాల్గొంటాయి. ఇందులో యూరోపియన్ కమిషన్, GCC సెక్రటేరియట్ జనరల్స్ కూడా పాల్గొంటారు. సమావేశంలో మంత్రులు ఉమ్మడి ప్రాధాన్యతలపై చర్చిస్తారు. EU-GCC వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషిస్తారు. భద్రత మరియు శాంతి సమస్యలపై చర్చిస్తారు. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ , మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంపై ఉన్న సంక్షిష్టతలపై ఫోకస్ చేస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!
- ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 22 మంది అరెస్టు..!!
- ఖతార్లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!
- ప్రాంతీయ భద్రతపై క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు చర్చలు..!!
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..









