GCC-EU జాయింట్ మినిస్టీరియల్ సమావేశానికి ఒమన్ ఆతిథ్యం
- October 06, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ 2023 అక్టోబర్ 9, 10 తేదీలలో EU-GCC జాయింట్ మినిస్టీరియల్ కౌన్సిల్ 27వ సెషన్ను నిర్వహించనుంది. GCC పక్షానికి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ నేతృత్వం వహిస్తుండగా..ఈయూ పక్షానికి యూరోపియన్ యూనియన్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలసీ ఉన్నత ప్రతినిధి జోసెఫ్ బోరెల్ నాయకత్వం వహిస్తారు. ఈ సమావేశానికి జిసిసి సెక్రటరీ జనరల్ జాసిమ్ మహ్మద్ అల్ బుదైవి హాజరుకానున్నారు. యూరోపియన్ యూనియన్ , GCC రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముప్పైకి పైగా అధికారిక ప్రతినిధి బృందాలు సమావేశంలో పాల్గొంటాయి. ఇందులో యూరోపియన్ కమిషన్, GCC సెక్రటేరియట్ జనరల్స్ కూడా పాల్గొంటారు. సమావేశంలో మంత్రులు ఉమ్మడి ప్రాధాన్యతలపై చర్చిస్తారు. EU-GCC వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషిస్తారు. భద్రత మరియు శాంతి సమస్యలపై చర్చిస్తారు. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ , మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంపై ఉన్న సంక్షిష్టతలపై ఫోకస్ చేస్తారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







