సైబరాబాద్ లో నూతన బ్యారెక్ ల ప్రారంభం
- October 06, 2023
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో నూతన బ్యారెక్ లను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ సీపీ (అడ్మిన్) అవినాష్ మహంతితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఏఆర్ సిబ్బంది సౌకర్యార్థం ఇదివరకు ఉన్న బ్యారెక్ లకు అనుబంధంగా అధునాతన సౌకర్యాలతో మూడు నూతన బ్యారెక్ లను సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభించామన్నారు.
ఈ బ్యారెక్ లలో స్టోరేజ్ బెడ్స్, రిసెప్షన్, వ్యక్తిగత సెక్యూరిటీ లాకర్లు, కూలర్లు, డైనింగ్, వాష్ రూమ్స్ తదితర సౌకర్యాలు ఉంటాయి.
సీపీ గారి వెంట.. సైబరాబాద్ అడిషనల్ సీపీ (అడ్మిన్) సీపీ అవినాష్ మహంతి, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగన్వార్, డీసీపీ అడ్మిన్ యోగేష్ గౌతమ్, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ శబరీష్, W&CSW డీసీపీ నితిక పంత్, డీసీపీ సైబర్ క్రైమ్స్ రితి రాజ్, EOW డీసీపీ ప్రసాద్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ J. SK షమీర్, ఏడీసీపీ CSW శ్రీనివాస్ చౌదరీ, ఏసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఇంద్రవర్ధన్, ఏసీపీ (హోమ్ గార్డ్స్) శ్రీ కృష్ణ, ఏసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మట్టయ్య, ఆర్ఐ ఎస్టేట్ ఆఫీసర్ హిమకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









