రస్ అల్ ఖైమా-ఒమన్ ముసందమ్ మొదటి ల్యాండ్ ట్రిప్ ప్రారంభం
- October 07, 2023
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమాను ఒమన్ సుల్తానేట్ ముసందంతో కలుపుతూ RAK ట్రాన్స్పోర్ట్ అథారిటీ తొలి ల్యాండ్ ట్రిప్ సర్వీస్ను ప్రారంభించింది. ముసందమ్ గవర్నరేట్ భాగస్వామ్యంతో ఈ సేవ ప్రారంభించబడింది.వారాంతాల్లో రోజుకు రెండు ట్రిప్పులతో ఇది నడుస్తుంది. రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని మెరుగుపరచడానికి, నివాసితులు మరియు పర్యాటకులు ఇరువురి వ్యక్తుల కదలికను సులభతరం చేయడానికి యూఏఈ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా ఈ సేవను ప్రారంభించడం జరిగిందని RAKTA డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ హసన్ అల్ బలూషి అన్నారు. ఈ సర్వీస్ రస్ అల్ ఖైమాలోని ప్రధాన బస్ స్టేషన్ నుండి బయలుదేరి ఏడు స్టాప్ల గుండా వెళుతుంది. ఖసాబ్, ముసందమ్ గవర్నరేట్లో ముగుస్తుంది. ప్రారంభోత్సవ వేడుకలో ముసందం గవర్నరేట్ మొదటి బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు రిసెప్షన్ను నిర్వహించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









