రస్ అల్ ఖైమా-ఒమన్ ముసందమ్ మొదటి ల్యాండ్ ట్రిప్ ప్రారంభం
- October 07, 2023
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమాను ఒమన్ సుల్తానేట్ ముసందంతో కలుపుతూ RAK ట్రాన్స్పోర్ట్ అథారిటీ తొలి ల్యాండ్ ట్రిప్ సర్వీస్ను ప్రారంభించింది. ముసందమ్ గవర్నరేట్ భాగస్వామ్యంతో ఈ సేవ ప్రారంభించబడింది.వారాంతాల్లో రోజుకు రెండు ట్రిప్పులతో ఇది నడుస్తుంది. రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని మెరుగుపరచడానికి, నివాసితులు మరియు పర్యాటకులు ఇరువురి వ్యక్తుల కదలికను సులభతరం చేయడానికి యూఏఈ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా ఈ సేవను ప్రారంభించడం జరిగిందని RAKTA డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ హసన్ అల్ బలూషి అన్నారు. ఈ సర్వీస్ రస్ అల్ ఖైమాలోని ప్రధాన బస్ స్టేషన్ నుండి బయలుదేరి ఏడు స్టాప్ల గుండా వెళుతుంది. ఖసాబ్, ముసందమ్ గవర్నరేట్లో ముగుస్తుంది. ప్రారంభోత్సవ వేడుకలో ముసందం గవర్నరేట్ మొదటి బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు రిసెప్షన్ను నిర్వహించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







