రస్ అల్ ఖైమా-ఒమన్ ముసందమ్ మొదటి ల్యాండ్ ట్రిప్ ప్రారంభం
- October 07, 2023
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమాను ఒమన్ సుల్తానేట్ ముసందంతో కలుపుతూ RAK ట్రాన్స్పోర్ట్ అథారిటీ తొలి ల్యాండ్ ట్రిప్ సర్వీస్ను ప్రారంభించింది. ముసందమ్ గవర్నరేట్ భాగస్వామ్యంతో ఈ సేవ ప్రారంభించబడింది.వారాంతాల్లో రోజుకు రెండు ట్రిప్పులతో ఇది నడుస్తుంది. రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని మెరుగుపరచడానికి, నివాసితులు మరియు పర్యాటకులు ఇరువురి వ్యక్తుల కదలికను సులభతరం చేయడానికి యూఏఈ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా ఈ సేవను ప్రారంభించడం జరిగిందని RAKTA డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ హసన్ అల్ బలూషి అన్నారు. ఈ సర్వీస్ రస్ అల్ ఖైమాలోని ప్రధాన బస్ స్టేషన్ నుండి బయలుదేరి ఏడు స్టాప్ల గుండా వెళుతుంది. ఖసాబ్, ముసందమ్ గవర్నరేట్లో ముగుస్తుంది. ప్రారంభోత్సవ వేడుకలో ముసందం గవర్నరేట్ మొదటి బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు రిసెప్షన్ను నిర్వహించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి









