పౌరులకు రక్షణ కల్పించాలి, హింసను తక్షణమే ముగించాలి:యూఏఈ అప్పీల్

- October 09, 2023 , by Maagulf
పౌరులకు రక్షణ కల్పించాలి, హింసను తక్షణమే ముగించాలి:యూఏఈ అప్పీల్

యూఏఈ:  పౌరులకు రక్షణ కల్పించాలని, తక్షణమే హింసను ముగించాలని యూఏఈ  విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ పట్టణాలు, గ్రామాలపై హమాస్ దాడులు, జనాభా కేంద్రాలపై వేల రాకెట్లను ప్రయోగించడం తీవ్రమైన చర్యలని, ఇజ్రాయెల్ పౌరులను వారి ఇళ్ల నుండి బందీలుగా అపహరించినట్లు వచ్చిన నివేదికలతో మంత్రిత్వ శాఖ విస్మయం చెందిందని తెలిపారు. రెండు వైపులా పౌరులు ఎల్లప్పుడూ అంతర్జాతీయ మానవతా చట్టం కింద పూర్తి రక్షణ కలిగి ఉండాలని సూచించింది. బాధిత కుటుంబాలకు యూఏఈ తన సంతాపాన్ని తెలియజేసింది. ప్రాంతీయ ఘర్షణను నివారించడానికి అన్ని దౌత్య ప్రయత్నాల కోసం అప్పీల్ చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com