ఇజ్రాయెల్లో భారతీయుల భద్రతకు భరోసా ఇవ్వాలి: జైశంకర్కు కేరళ సిఎం లేఖ
- October 10, 2023
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో భారతీయుల భద్రత కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ కేరళ సీఎం పినరయి విజయన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్కు లేఖ రాశారు. హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ బలగాల మధ్య భీకరదాడులు కొనసాగుతున్న క్రమంలో అక్కడున్న కేరళ ప్రజలతో పాటు భారతీయుల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఇజ్రాయెల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కేరళకు చెందిన పలువురిని కష్టాల్లోకి నెడుతుండగా వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని లేఖలో కేరళ సీఎం విజయన్ వివరించారు.
ఇజ్రాయెల్లో మన పౌరుల భద్రత కోసం మీరు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని జైశంకర్కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రమూకలు శనివారం చేపట్టిన మెరుపు దాడులతో వందలాది మంది మృత్యువాతన పడగా, వేలాది మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రతిదాడులతో హమాస్ స్ధావరాలపై విరుచుకుపడుతోంది.
తాజా వార్తలు
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!







