176 మంది సౌదీలు, నివాసితులు అరెస్ట్
- October 17, 2023
రియాద్: సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) 1445 AH రబీ అల్-అవ్వల్ నెలలో 3,601 పర్యవేక్షణ పర్యటనలను నిర్వహించింది. ఈ సందర్భంగా 369 మంది అవినీతి అనుమానితులపై దర్యాప్తు చేసింది. 369 మంది అనుమానితుల్లో అంతర్గత, రక్షణ, న్యాయ, ఆరోగ్యం, విద్య, మునిసిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు మరియు హౌసింగ్, అలాగే జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ వంటి అనేక ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారని నజాహా తెలిపింది. విచారణ ప్రక్రియ తర్వాత 176 మంది సౌదీ పౌరులు, నివాసితులను అరెస్టు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ చట్టం ప్రకారం.. ఆ పౌరులు బెయిల్పై విడుదలయ్యారని నజాహా చెప్పింది. అరెస్టుకు గల కారణాల విషయానికొస్తే.. వారందరూ లంచం, అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, అలాగే ఫోర్జరీకి పాల్పడ్డారని అథారిటీ తెలిపింది. టోల్-ఫ్రీ నంబర్: 980, ఇమెయిల్: [email protected], ఫ్యాక్స్: 114420057 ద్వారా ఆర్థిక లేదా పరిపాలనా అవినీతికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద చర్యలను నివేదించాలని నజాహా కోరింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









