176 మంది సౌదీలు, నివాసితులు అరెస్ట్
- October 17, 2023
రియాద్: సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) 1445 AH రబీ అల్-అవ్వల్ నెలలో 3,601 పర్యవేక్షణ పర్యటనలను నిర్వహించింది. ఈ సందర్భంగా 369 మంది అవినీతి అనుమానితులపై దర్యాప్తు చేసింది. 369 మంది అనుమానితుల్లో అంతర్గత, రక్షణ, న్యాయ, ఆరోగ్యం, విద్య, మునిసిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు మరియు హౌసింగ్, అలాగే జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ వంటి అనేక ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారని నజాహా తెలిపింది. విచారణ ప్రక్రియ తర్వాత 176 మంది సౌదీ పౌరులు, నివాసితులను అరెస్టు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ చట్టం ప్రకారం.. ఆ పౌరులు బెయిల్పై విడుదలయ్యారని నజాహా చెప్పింది. అరెస్టుకు గల కారణాల విషయానికొస్తే.. వారందరూ లంచం, అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, అలాగే ఫోర్జరీకి పాల్పడ్డారని అథారిటీ తెలిపింది. టోల్-ఫ్రీ నంబర్: 980, ఇమెయిల్: [email protected], ఫ్యాక్స్: 114420057 ద్వారా ఆర్థిక లేదా పరిపాలనా అవినీతికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద చర్యలను నివేదించాలని నజాహా కోరింది.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







