ఎమిరేట్స్ డ్రాలో 25 సంవత్సరాలకు 25,000 దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ వ్యక్తి
- October 21, 2023
యూఏఈ: భారతదేశానికి చెందిన మగేష్ కుమార్ నటరాజన్ రాబోయే 25 సంవత్సరాలకు నెలవారీ Dh25,000 FAST5 గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఇది అతన్ని మొదటి గ్లోబల్ గ్రాండ్ ప్రైజ్ విజేతగా, యూఏఈ ఏతర మొదటి విజేతగా చేసింది. ఈ సందర్భంగా మగేష్ మాట్లాడుతూ..తాను మొత్తం ఐదు సంఖ్యలతో సరిపోలినట్లు యాప్లో తనిఖీ చేసినప్పుడు నమ్మలేదని, ఎమిరేట్స్ డ్రా నుంచి కాల్ రాగానే నమ్మినట్లు చెప్పారు. 49 ఏళ్ల అతను భారతదేశంలోని తమిళనాడులోని అంబూర్లో ప్రాజెక్ట్ మేనేజర్. 2019 నుండి ఈ సంవత్సరం ఆరంభం వరకు సౌదీ అరేబియా రాజ్యంలో పనిచేశారు. దుబాయ్కి వెళుతున్నప్పుడు డ్రా గురించి తెలుసుకుని, బహుమతిని గెలుచుకోవాలనే ఆశతో ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు. వచ్చిన మొత్తాన్ని తన కుమార్తెల విద్య కోసం వినియోగించనున్నట్లు, తన కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తును అందించాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు మగేష్ వివరించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







