PACI కార్డుల రుసుములపై పబ్లిక్ అథారిటీ కీలక నిర్ణయం
- October 21, 2023
కువైట్: తదుపరి పునరుద్ధరణ సమయంలో ఇంకా కార్డులు జారీ చేయని వారి కోసం 5 KD కార్డ్ పునరుద్ధరణ రుసుమును వసూలు చేయదని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) పౌర రిజిస్ట్రేషన్ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జబర్ అల్-కందారి స్పష్టం చేశారు. గత మే 23కి ముందు కార్డ్ పునరుద్ధరణను సమర్పించిన వారందరికీ PACI కార్డ్లను జారీ చేయడం ఆపివేసింది. కొత్త అభ్యర్థన ప్రాసెస్ చేయబడుతుందని, చాలా సందర్భాలలో 24 నుండి 48 గంటలలోపు కార్డ్లు జారీ చేయబడతాయని తెలిపారు. పాత అభ్యర్థనలు ప్రాసెస్ చేయబడనందున, ముందుగా 5 KD రుసుమును చెల్లించిన వారు వారి తదుపరి పునరుద్ధరణ అభ్యర్థన సమయంలో మళ్లీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని జబర్ అల్-కందారి వివరించారు. కొత్త కార్డుల జారీలో జాప్యం జరుగుతుందని, యంత్రాల్లో పేరుకుపోకుండా ఉండేందుకు, కార్డులు సిద్ధమైన తర్వాత వాటిని తీసుకోవాలని నివాసితులందరినీ ఆయన కోరారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









