తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 23, 2023
దోహా: తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఘనంగా మహా బతుకమ్మ సంబరాలు. ఆకట్టుకున్న చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1, నమూనాలు. తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు సుధ రామోజు తెలిపిన వివరాల ప్రకారం దోహా, ఖతర్ ఇండియన్ కల్చరల్ సెంటర్ లో భారీ జన సందోహం నడుమ తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ అడ్వైసరి కౌన్సిల్ చైర్ పర్సన్ నందిని అబ్బగౌని ఆధ్వర్యంలో భారీ జన సందోహం నడుమ తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిధులుగా ఖతర్ భారత రాయబార కార్యాలయం ప్రథమ కార్యదర్శి సచిన్ దినకర్ శంక్పాల్ హాజరు కాగా, ఐసీసీ అధ్యక్షుడు AP మణికంఠన్, ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ అధ్యక్షుడు EP అబ్దుల్ రెహ్మాన్, icbf ఉపాధ్యక్షులు దీపక్ శెట్టి ,ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం హెబ్బగెలు, ప్రధాన కార్యదర్శి మోహన్ కుమార్, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ మలి రెడ్డి, సజీవ్ సత్యశీలన్, సుమ మహేశ్ గౌడ, సీనియర్ కమ్యూనిటీ లీడర్ శివరాం ప్రసాద్ కోడూరు, వివిధ సంఘాల ప్రెసిడెంట్లు అతిథులుగా హాజరయ్యారని తెలిపారు.ఈ సందర్భంగా జాగృతి ఖతర్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ లక్ష్మి గంట మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో వినూత్నంగా బతుకమ్మ నిర్వహిస్తూ వస్తున్న తెలంగాణ జాగృతి ఖతర్, ఈసారి నాలుగేళ్ల అవిశ్రాంత కృషి తో మానవ మేధస్సు కు మచ్చు తునక లాంటి చంద్రయాన్ ప్రయోగంతో భారత కీర్తి పతాకాన్ని ప్రపంచం నివ్వెర పోయేల విజయ వంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి కి కృతజ్ఞతా పూర్వకంగా చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1, నమూనాల లతో ప్రదర్శించిన మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది అని అన్నారు. సాంస్కృతిక కార్య క్రమాల్లో భాగంగా ఆడపడుచులు, చిన్నారులు చేసిన నృత్యాలు జనాన్ని ఉర్రూతలోగించాయి. అన్ని వర్గాల మద్దతుతో పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో విదేశి గడ్డ పై ఆడపడుచులు సాంప్రదాయ బతుకమ్మ ఆట పాటలతో లయ బద్ధంగా ఆడుతూ కనుల విందు చేశారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తు పిండి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.


--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









