2024-25లో యూనిఫైడ్ జిసిసి వీసా
- October 24, 2023
యూఏఈ : గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు ఏకీకృత టూరిస్ట్ వీసా ఆమోదం పొందిందని, వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని ప్రారంభించనున్నట్లు యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. మస్కట్లో జరిగిన GCC మంత్రుల సమావేశంలో స్కెంజెన్-శైలి వీసాను ఆమోదించినట్లు పేర్కొన్నారు. దీనితో ఒకే వీసాతో పర్యాటకులు ఆరు గల్ఫ్ దేశాలను సందర్శించవచ్చు. ఈ వీసాను 2024 -25లో అమలులోకి తేవాలని భావిస్తున్నారు.
యూఏఈ యొక్క ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం రంగం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. GDPలో 14 శాతం వాటా కలిగి ఉంది. దీనిని 18 శాతానికి పెంచాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు.2023 మొదటి అర్ధభాగంలో 8.55 మిలియన్ల అంతర్జాతీయ సందర్శకులు యూఏఈని సందర్శించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ స్కెంజెన్-శైలి టూరిస్ట్ వీసాతో జీసీసీ దేశాల ఆర్థిక వ్యవస్థలకు గేమ్ ఛేంజర్గా మారుతుందని, ఈ ప్రాంతంలోని పౌరులు మరియు నివాసితులకు అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని హోటల్ యజమానులు, ట్రావెల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









