8 నెలలలో ఈ-స్కూటర్ ప్రమాదాల్లో 5 మంది మృతి, 29 మందికి గాయాలు
- October 25, 2023
దుబాయ్: గత ఎనిమిది నెలలుగా దుబాయ్లో జరిగిన ఈ-స్కూటర్ ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. ఇ-స్కూటర్లపై 32 ప్రమాదాలు నమోదుఖ్యినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
ఎనిమిది నెలల్లో రైడర్లపై 10,000 జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. రైడర్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వీడియోను పోలీసులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే రైడర్లపై 300 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇ-స్కూటర్ను నడపడం వంటి ఉల్లంఘనలను వీడియోలో చూపించారు. ఈ-స్కూటర్ రైడర్లు అన్ని సంబంధిత భద్రతా నియమాలను పాటించాలని అధికారి కోరారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









