గాజాలో పౌరులే లక్ష్యంగా దాడులు.. ఖండించిన అరబ్ దేశాలు
- October 27, 2023
యూఏఈ: పౌరులను లక్ష్యంగా చేసుకోని ఇజ్రాయెట్ వైమానికి దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని యూఏఈ తోపాటు ఇతర ఎనిమిది అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, ఈజిప్ట్ మరియు మొరాకో విదేశాంగ మంత్రులు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజా స్ట్రిప్లో తక్షణ మరియు స్థిరమైన కాల్పుల విరమణ కోసం UN భద్రతా మండలికి పిలుపునిచ్చారు. అక్టోబరు 21న ఈజిప్టు రాజధానిలో జరిగిన 'కైరో శాంతి శిఖరాగ్ర సదస్సు' తర్వాత తాజా ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ మానవతా చట్టాలతో సహా 1949 జెనీవా ఒప్పందాల ప్రోటోకాల్లను పాటించాల్సిన ఆవశ్యకతను అరబ్ దేశాలు గుర్తుచేసాయి. బాధిత పాలస్తీనా ప్రజలకు ఆర్థిక మరియు వస్తుపరమైన సహాయాన్ని అందించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు