గాజా ఇష్యూపై భారత్ తో ఒమన్ చర్చలు
- October 28, 2023
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ హమద్ అల్ బుసైదీ ఈరోజు ఫోన్ కాల్ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, సమన్వయ సంబంధాలపై చర్చించారు. గాజా స్ట్రిప్, దాని పరిసరాలలో బాధాకరమైన మానవతా పరిస్థితులు, పరిణామాలపై కూడా ఇద్దరు మంత్రులు చర్చించారు. మానవతా అవసరాలను అందించాల్సిన ఆవశ్యకత, సంక్షోభం తీవ్రతను తగ్గించడం ప్రాముఖ్యతపై వారు అంగీకరించారు. అన్ని పార్టీలు హింస, ఉగ్రవాదాన్ని వీడాలని కోరారు. న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించడానికి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాలని వారు చెప్పారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్రమణను ముగించాలని కోరారు.
తాజా వార్తలు
- అరబ్ లో అతి తక్కువ ప్రయాణ సమయం కలిగిన నగరాల్లో మస్కట్..!!
- 13,072 మంది ఉల్లంఘనదారులపై బహిష్కరణ వేటు..!!
- కేబుల్ రీల్స్ లో 3,037 ఆల్కహాల్ బాటిల్స్..!!
- యూకే బయలుదేరిన కువైట్ అమీర్..!!
- ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!