గాజా ఇష్యూపై భారత్ తో ఒమన్ చర్చలు
- October 28, 2023
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ హమద్ అల్ బుసైదీ ఈరోజు ఫోన్ కాల్ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, సమన్వయ సంబంధాలపై చర్చించారు. గాజా స్ట్రిప్, దాని పరిసరాలలో బాధాకరమైన మానవతా పరిస్థితులు, పరిణామాలపై కూడా ఇద్దరు మంత్రులు చర్చించారు. మానవతా అవసరాలను అందించాల్సిన ఆవశ్యకత, సంక్షోభం తీవ్రతను తగ్గించడం ప్రాముఖ్యతపై వారు అంగీకరించారు. అన్ని పార్టీలు హింస, ఉగ్రవాదాన్ని వీడాలని కోరారు. న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించడానికి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాలని వారు చెప్పారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్రమణను ముగించాలని కోరారు.
తాజా వార్తలు
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!







