గాజా ఇష్యూపై భారత్ తో ఒమన్ చర్చలు
- October 28, 2023
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ హమద్ అల్ బుసైదీ ఈరోజు ఫోన్ కాల్ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, సమన్వయ సంబంధాలపై చర్చించారు. గాజా స్ట్రిప్, దాని పరిసరాలలో బాధాకరమైన మానవతా పరిస్థితులు, పరిణామాలపై కూడా ఇద్దరు మంత్రులు చర్చించారు. మానవతా అవసరాలను అందించాల్సిన ఆవశ్యకత, సంక్షోభం తీవ్రతను తగ్గించడం ప్రాముఖ్యతపై వారు అంగీకరించారు. అన్ని పార్టీలు హింస, ఉగ్రవాదాన్ని వీడాలని కోరారు. న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించడానికి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాలని వారు చెప్పారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్రమణను ముగించాలని కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









