గాజాలో పౌరుల్ని రక్షించండి.. ఇజ్రాయెల్ ప్రధానికి బైడెన్ ఫోన్
- October 30, 2023
వాషింగ్టన్: హమాస్ను సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ గాజాపై విచక్షణారహితంగా విరుచుకు పడుతోంది. ఈ దాడుల్లో గాజాలోని సామాన్య పౌరులు పిట్టల్లా రాలిపోతున్నారు. ..ముఖ్యంగా చిన్నారులు, మహిళలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచమంతా ఈ నరమేధాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నా.. ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన అమెరికా ఆ దేశానికి ఓ సూచన చేసింది.
ఇజ్రాయెల్కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని చెబుతూనే.. గాజాలో సామాన్య పౌరుల ప్రాణాలను రక్షించే అంతర్జాతీయ చట్టాలకు అణుగుణంగా ఇజ్రాయెల్ వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. గాజాలో సామాన్య పౌరులను రక్షించాలని ఈ సందర్భంగా బైడెన్ కోరారు. ఓవైపు వైమానికి దాడులు.. మరోవైపు భూతల దాడులతో గాజాలో భీతావహ పరిస్థితులు ఎదురవుతున్నాయని.. సరైన తిండి, నీరు లేక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా గాజా పౌరులకు మానవతా సాయం అందేలా చూడాలని నెతన్యాహుకు బైడెన్ ఫోన్లో సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







