ఇజ్రాయెల్ ఆధీనంలో గాజా స్ట్రిప్!
- November 01, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ దళాలు మంగళవారం గాజా స్ట్రిప్ లోపల హమాస్ మిలిటెంట్లతో ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించాయి. సైన్యం దాడుల్లో పదుల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు మరణించారు. అదే సమయంలో వైమానిక దాడులు కొనసాగాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఉత్తర గాజాలోని అల్ తవామ్ ప్రాంతంలో తమ యోధులు సైనికులతో మెరుపుదాడి చేశారని హమాస్ సాయుధ విభాగం తెలిపింది. ఉత్తర గాజా స్ట్రిప్లోని పశ్చిమ తవామ్లో దాడి చేసే (ఇజ్రాయెల్ సైన్యం) వాహనాలపై ఆకస్మికంగా కాల్పులు జరిపారని, మూడు జియోనిస్ట్ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారని ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో 800,000 మంది పాలస్తీనియన్లు ఇళ్లు వదిలి తరలిపోయినట్లు అంచనా. దాదాపు 672,000 మంది పాలస్తీనియన్లు తమ పాఠశాలలు, ఇతర సౌకర్యాలలో ఆశ్రయం పొందుతున్నారని UNRWA అని పిలువబడే పాలస్తీనియన్ శరణార్థుల కోసం UN ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటివరకు యుద్ధంలో పాలస్తీనాలో 8500 మంది, ఇజ్రాయెల్ లో 1400 మంది మరణించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









