డయాబెటిస్ వున్నవాళ్లు సీతాఫలం తీనకూడదా.?
- November 01, 2023
డయాబెటిస్ వున్నవాళ్లు ఆహారం విషయంలో కొన్ని ప్రణాళికబద్దమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు చక్కెర ఎక్కువగా వుండే ఆహార పదార్ధాలను తీసుకునే ముందు కాస్త జాగ్రత్త వహించాలి. ఆచి తూచి వ్యవహరించాలి. వైద్యుని సలహా తీసుకోవాలి.
పండ్లలో జామ పండు డయాబెటిస్ వాళ్లకు చాలా మంచి పండు. అయితే, కాస్త పచ్చిగా వున్నప్పుడే జామకాయను తింటే మంచిది. పండిన జామ పండులో చక్కెర శాతం ఎక్కువగా వుంటుంది. వాటిని అవైడ్ చేస్తే మంచిది.
అలాగే, సీజనల్ ఫ్రూట్గా చెప్పుకునే సీతాఫలం తింటే, డయాబెటిస్ వున్న వాళ్లకు ప్రమాదమే అని చెబుతున్నారు. ఈ పండులో గ్జైనమిక్ ఇండెక్స్ 54గా వుంటుంది. కానీ, డయాబెటిస్ వున్న వాళ్లు ఇంత కన్నా తక్కువ గ్జైనమిక్ ఇండెక్స్ వున్న ఆహార పదార్ధాలనే తీసుకోవాల్సి వుంటుంది.
సో, సీతాఫలం డయాబెటిస్ వాళ్లకు అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. సీజనల్ ఫ్రూట్ కావట్టి.. చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఓకే. అది కూడా షుగర్ లెవల్స్ నార్మల్ స్థాయిలో వున్న వాళ్లకు మాత్రమే.
షుగర్ నియంత్రణలో లేని వాళ్లు సీతా ఫలం జోలికి పోరాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, సీతాఫలం మిగిలిన వాళ్లకు చాలా మంచిది. ఈ పండును తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ పండులో హెమోగ్లోబిన్ స్థాయి అధికంగా వుంటుంది. అలాగే కాల్షియం, మెగ్నీషింయం, విటమిన్ సి, ఇ అధికంగా వుంటాయ్. సో, డయాబెటిస్ లేని వాళ్లు ఈ పండును తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి