డయాబెటిస్ వున్నవాళ్లు సీతాఫలం తీనకూడదా.?
- November 01, 2023
డయాబెటిస్ వున్నవాళ్లు ఆహారం విషయంలో కొన్ని ప్రణాళికబద్దమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు చక్కెర ఎక్కువగా వుండే ఆహార పదార్ధాలను తీసుకునే ముందు కాస్త జాగ్రత్త వహించాలి. ఆచి తూచి వ్యవహరించాలి. వైద్యుని సలహా తీసుకోవాలి.
పండ్లలో జామ పండు డయాబెటిస్ వాళ్లకు చాలా మంచి పండు. అయితే, కాస్త పచ్చిగా వున్నప్పుడే జామకాయను తింటే మంచిది. పండిన జామ పండులో చక్కెర శాతం ఎక్కువగా వుంటుంది. వాటిని అవైడ్ చేస్తే మంచిది.
అలాగే, సీజనల్ ఫ్రూట్గా చెప్పుకునే సీతాఫలం తింటే, డయాబెటిస్ వున్న వాళ్లకు ప్రమాదమే అని చెబుతున్నారు. ఈ పండులో గ్జైనమిక్ ఇండెక్స్ 54గా వుంటుంది. కానీ, డయాబెటిస్ వున్న వాళ్లు ఇంత కన్నా తక్కువ గ్జైనమిక్ ఇండెక్స్ వున్న ఆహార పదార్ధాలనే తీసుకోవాల్సి వుంటుంది.
సో, సీతాఫలం డయాబెటిస్ వాళ్లకు అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. సీజనల్ ఫ్రూట్ కావట్టి.. చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఓకే. అది కూడా షుగర్ లెవల్స్ నార్మల్ స్థాయిలో వున్న వాళ్లకు మాత్రమే.
షుగర్ నియంత్రణలో లేని వాళ్లు సీతా ఫలం జోలికి పోరాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, సీతాఫలం మిగిలిన వాళ్లకు చాలా మంచిది. ఈ పండును తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ పండులో హెమోగ్లోబిన్ స్థాయి అధికంగా వుంటుంది. అలాగే కాల్షియం, మెగ్నీషింయం, విటమిన్ సి, ఇ అధికంగా వుంటాయ్. సో, డయాబెటిస్ లేని వాళ్లు ఈ పండును తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







