పాలస్తీనియన్ల పై ఇజ్రాయెల్ ఊచకోతను ఖండించిన ఒమన్
- November 05, 2023
మస్కట్: పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు కొనసాగిస్తున్న మారణకాండపై ఒమన్ సుల్తానేట్ శనివారం తీవ్రంగా ఖండించింది. పౌరులు మరియు ఆరోగ్య రంగ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర గాజా స్ట్రిప్లోని జబాలియాలోని UNRWAకి అనుబంధంగా ఉన్న అల్-ఫఖౌరా స్కూల్పై బాంబు దాడి జరిగింది. గాజా స్ట్రిప్కు దక్షిణాన ఉన్న రఫాకు తూర్పున అనేక పరిసరాలకు సరఫరా చేసే పబ్లిక్ వాటర్ ట్యాంక్పై బాంబు దాడి జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులకు తెగబడుతుందని, అంతర్జాతీయ ఉల్లంఘనకు ముగింపు పలికేందుకు అంతర్జాతీయ కలిసి రావాలని సుల్తానేట్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను విచారించడానికి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయమని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును అభ్యర్థించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల