సిడ్నీ నుండి దుబాయ్ విమానంలో సాంకేతిక లోపం
- June 26, 2015
విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో దాన్ని అత్యవసరంగా దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసరంగా విమానాన్ని దింపడంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండ చూసిన విమానం పైలెట్లను ప్రయాణికులతో పాటు అధికారులు అభినందించారు. సిడ్నీ నుండి దుబాయ్ కి ఎమిరేట్స్ విమానం ఏ-380-ఈకే 413 బయలుదేరింది. దుబాయ్ వెళుతున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని పైలెట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. పై అధికారుల అనుమతితో విమానాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అధికారులు విమానంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ సాంకేతిక లోపం వచ్చిందనేది ఆరా తీశారు. విమానంలో మొత్తం 500 మంది ప్రయాణికులు, అధికారులు ఉన్నారు. అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం వచ్చిందనేదిఅధికారులు వెల్లడించలేదు. అయితే పైలెట్ లు సమయానికి స్పందించి విమానం కిందకు దించారని అందరూ వారిని అభినందించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







