సిడ్నీ నుండి దుబాయ్ విమానంలో సాంకేతిక లోపం
- June 26, 2015
విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో దాన్ని అత్యవసరంగా దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసరంగా విమానాన్ని దింపడంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండ చూసిన విమానం పైలెట్లను ప్రయాణికులతో పాటు అధికారులు అభినందించారు. సిడ్నీ నుండి దుబాయ్ కి ఎమిరేట్స్ విమానం ఏ-380-ఈకే 413 బయలుదేరింది. దుబాయ్ వెళుతున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని పైలెట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. పై అధికారుల అనుమతితో విమానాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అధికారులు విమానంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ సాంకేతిక లోపం వచ్చిందనేది ఆరా తీశారు. విమానంలో మొత్తం 500 మంది ప్రయాణికులు, అధికారులు ఉన్నారు. అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం వచ్చిందనేదిఅధికారులు వెల్లడించలేదు. అయితే పైలెట్ లు సమయానికి స్పందించి విమానం కిందకు దించారని అందరూ వారిని అభినందించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









