సిడ్నీ నుండి దుబాయ్ విమానంలో సాంకేతిక లోపం
- June 26, 2015
విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో దాన్ని అత్యవసరంగా దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసరంగా విమానాన్ని దింపడంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండ చూసిన విమానం పైలెట్లను ప్రయాణికులతో పాటు అధికారులు అభినందించారు. సిడ్నీ నుండి దుబాయ్ కి ఎమిరేట్స్ విమానం ఏ-380-ఈకే 413 బయలుదేరింది. దుబాయ్ వెళుతున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని పైలెట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. పై అధికారుల అనుమతితో విమానాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అధికారులు విమానంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ సాంకేతిక లోపం వచ్చిందనేది ఆరా తీశారు. విమానంలో మొత్తం 500 మంది ప్రయాణికులు, అధికారులు ఉన్నారు. అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం వచ్చిందనేదిఅధికారులు వెల్లడించలేదు. అయితే పైలెట్ లు సమయానికి స్పందించి విమానం కిందకు దించారని అందరూ వారిని అభినందించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







